
- ఉక్రెయిన్తో యుద్ధం తర్వాత కూడా రష్యాతో సంబంధాలు
- 50 రోజుల్లో శాంతి ఒప్పందం కుదిర్చేలా పుతిన్ను ఒప్పించాలని ఒత్తిడి
- ఈ హెచ్చరికలను పట్టించుకోబోమన్న రష్యా
50 రోజుల్లో శాంతి ఒప్పందం కుదరకపోతే రష్యా ఎగుమతుల కొనుగోలుదారులపై 100 శాతం ‘కఠినమైన’ సెకండరీ టారిఫ్లు విధిస్తామని ట్రంప్ ప్రకటించిన తర్వాతి రోజే నాటో ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం. “చైనా అధ్యక్షుడు, భారత ప్రధానమంత్రి, లేదా బ్రెజిల్ అధ్యక్షుడు అయినా సరే రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తే, ఈ ఆంక్షలు మీ దేశాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. కాబట్టి, దయచేసి వ్లాదిమిర్ పుతిన్కు ఫోన్ చేసి శాంతి చర్చలను సీరియస్గా తీసుకోవాలని చెప్పండి. లేకపోతే ఇది భారత్, చైనా, బ్రెజిల్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది” అని రుట్టే పత్రికా ప్రతినిధులతో అన్నారు.
2022లో ఉక్రెయిన్పై రష్యా దాడి చేసినప్పటి నుంచి భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు రష్యన్ చమురు, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తున్నాయి. ఈ దేశాలు పశ్చిమ దేశాల ఆంక్షలలో చేరకుండా రష్యాతో వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలను నిలుపుకున్నాయి. అయితే, ఈ ఆంక్షల బెదిరింపు ఈ దేశాలకు దౌత్యపరంగా, ఆర్థికంగా కొత్త సవాళ్లను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఈ హెచ్చరికలపై రష్యా కూడా స్పందించింది.
రష్యా భద్రతా అధికారి దిమిత్రీ మెద్వెదేవ్ ఈ ఆంక్షల బెదిరింపులను ‘నాటకీయ హెచ్చరిక’గా అభివర్ణించారు, రష్యా దీనిని పట్టించుకోదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ, ఈ పరిణామాలు భారత్ వంటి దేశాలకు రష్యాతో ఉన్న వాణిజ్య సంబంధాలను పునఃపరిశీలించే అవసరాన్ని తెలియజేస్తున్నాయి. ఈ ఆంక్షల బెదిరింపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా రష్యాతో వాణిజ్య సంబంధాలు కలిగిన దేశాలపై తీవ్ర ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.