మాస్టర్ వికాస్, విజయ్కృష్ణ, మాస్టర్ భాను, అరుణ్, మయనద్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అబద్ధమేవ జయతే’. కె.కార్తీకేయన్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పర్పుల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది.

మాస్టర్ వికాస్, విజయ్కృష్ణ, మాస్టర్ భాను, అరుణ్, మయనద్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అబద్ధమేవ జయతే’. కె.కార్తీకేయన్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పర్పుల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది. ఇటీవల జరిగిన సమావేశంలో ఈ చిత్ర టైటిల్ను యువ హీరో కార్తికేయ, ఫస్ట్లుక్ను హీరో సుధీర్బాబు విడుదల చేశారు.ఈ సినిమాలో స్త్రీల గర్భాధారణ, ప్రసవ సమయంలో ఎదుర్కొనే సమస్యలను చర్చించామని, ‘అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు’ అనే సామెత ఆధారంగా కాస్త హాస్యం జోడించి ఈ చిత్రాన్ని రూపొందించామని మేకర్స్ తెలిపారు.